http://telugunews7.com/
http://telugunews7.com /english/category/telangana/
నేడు కేసిఆర్ బహిరంగ సభ
గ్రేటర్ ఎన్నికల ప్రచారం ఆదివారంతో ముగియనుంది. టీఆర్ఎస్, టీడీపి-బీజేపి కూటమి, ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్ధులతో కలిసి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. టీడీపి గెలుపు కోసం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు రెండు రోజుల పాటు రోడ్ షోస్ లో పాల్గొన్నారు. ఇక ముందు నుంచే ప్రచారంలో ముందున్న టీఆర్ఎస్ పార్టీ దాదాపు అన్ని డివిజన్లను చుట్టేసింది. ఐటీ, పంచాయితీరాజ్ శాఖ మంత్రి కేటిఆర్ వివిధ కార్యక్రమాలతో ప్రచారం చేపట్టారు. ఇక ముఖ్యమంత్రి కేసిఆర్ కూడా ఈ-క్యాంపెయిన్ తో ప్రచారం ప్రారంభించారు.